Quarantine: చెమటలు చిందిస్తున్న ‘మిథాలి’ సేన

ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు టీమ్‌ఇండియా మహిళా జట్టు ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్లో కఠిన క్వారంటైన్‌లో ఉందనే సంగతి తెలిసిందే...

Published : 27 May 2021 22:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు టీమ్‌ఇండియా మహిళా జట్టు ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో కఠిన క్వారంటైన్‌లో ఉందనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెటర్లు అక్కడ హాయిగా సేద తీరుతూనే ఖాళీ సమయంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. మూడు సిరీస్‌ల్లో రాణించాలనే లక్ష్యంతో శారీరకంగా ఎంతో కష్టపడుతున్నారు. అందుకు సంబంధించిన విడియోను మహిళల బీసీసీఐ కాసేపటి క్రితం అభిమానులతో పంచుకుంది. అందులో కెప్టెన్‌ మిథాలిరాజ్‌తో పాటు ఇతర సభ్యులు  అనేక వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందిస్తూ పట్టుదలగా కనిపిస్తున్నారు.

మిథాలి టీమ్‌ జూన్‌ 16 నుంచి 20 వరకు ఇంగ్లాండ్‌తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ఆడనుండగా, అదేనెల 27 నుంచి జులై 3 వరకు మూడు వన్డేల సిరీస్‌, జులై 9 నుంచి 14వ వరకు మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా మహిళా జట్టు  ఏడాది తర్వాత మళ్లీ గత మార్చిలో దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడింది. ఈ సందర్భంగా ఐదు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ సైతం ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌లో రాణించాలనే పట్టుదలతో భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని