INDW vs PAKW: భారత్-పాక్ మ్యాచ్.. ఆత్మీయ సన్నివేశం!
భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే మమూలుగా ఉండదు. ముఖ్యంగా ప్రపంచకప్ల్లో ఈ దాయాది జట్లు తలపడే ఆ మ్యాచ్లకు ఫుల్క్రేజ్ ఉంటుంది. ఆటలో పైచేయి సాధించడానికి రెండు జట్లూ శాయశక్తులా పోరాడుతారు...
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే మమూలుగా ఉండదు. ముఖ్యంగా ప్రపంచకప్ల్లో ఈ దాయాది జట్లు తలపడే ఆ మ్యాచ్లకు ఫుల్క్రేజ్ ఉంటుంది. ఆటలో పైచేయి సాధించడానికి రెండు జట్లూ శాయశక్తులా పోరాడుతారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో క్రికెటర్ల మధ్య గొడవలూ జరిగిన ఉదంతాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. టీమ్ఇండియా విజయం కూడా సాధించింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్కు ఆరునెలల చిన్నారి ఫాతిమా ఉంది. బిస్మా ఓ వైపు తన చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటూనే మరోవైపు ప్రపంచకప్లో జట్టును నడిపిస్తోంది. అయితే, భారత్, పాక్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా క్రికెటర్లు పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అదే సమయంలో బిస్మా మరూఫ్ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకున్న వేళ భారత క్రికెటర్లు సైతం ప్రేమగా ఆ చిన్నారితో ఆడుకున్నారు. తర్వాత ఆ చిన్నారి, బిస్మాతో కలిసి సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐసీసీ సైతం ఇన్స్టాగ్రామ్లో పంచుకొని.. ‘భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ నుంచి లిటిల్ ఫాతిమాకు మొదటి క్రీడాస్పూర్తి పాఠం’ అని వ్యాఖ్యానం జోడించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం ఈ ఫోటోను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. తన ఫేస్బుక్లో ఆ ఫొటో షేర్ చేస్తూ.. ‘ఎంతో మధురమైన క్షణం! క్రికెట్కు మైదానంలో బౌండరీలు ఉంటాయి. కానీ, మైదానం వెలుపల ఉండవు’ అని పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు సైతం ఇరు జట్లూ ఇలాంటి క్రీడాస్ఫూర్తినే కొనసాగించాలని కామెంట్లు పెడుతుండటం విశేషం.
ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్ (67; 59 బంతుల్లో 8x4), స్నేహ్ రాణా (53 నాటౌట్; 48 బంతుల్లో 4x4), స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన పాక్.. 137 పరుగులకే ఆలౌటైంది. రాజేశ్వరి 4, ఝులన్ గోస్వామి 2, స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టారు. మేఘన సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!