INDW vs BANW : మరో నాలుగు వికెట్లు పడగొడితే చాలు..

సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమ్‌ఇండియాకు...

Updated : 22 Mar 2022 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమ్‌ఇండియాకు మరో నాలుగు వికెట్లు అవసరమైన కీలకమై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా 28 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజ్‌లో లతా మోందల్ (12*), రితు మోని (1*) ఉన్నారు. మిగతా బంగ్లా బ్యాటర్లలో ముర్షిద 19, షర్మిన్‌ అక్‌తేర్‌ 5, ఫర్గానా హక్ డకౌట్, నిగర్ 3, రుమాన అహ్మద్‌ 2, సల్మా ఖతున్ 32 పరుగులు చేశారు. టీమ్‌ఇండియా బౌలర్లలో స్నేహ్ రాణా 2..  రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, పూనమ్‌ యాదవ్, ఝులన్‌ గోస్వామి తలో వికెట్‌ తీశారు. బంగ్లాదేశ్‌ విజయం సాధించాలంటే 22 ఓవర్లలో 154 పరుగులు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని