Kuldeep Yadav: నా రిథమ్పైనే దృష్టిపెట్టా.. దూకుడుగా బౌలింగ్ చేశా: కుల్దీప్
బంగ్లాదేశ్పై ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకొన్నాడు. టెస్టు జట్టులోకి మళ్లీ రావడం ఆనందంగా ఉందని కుల్దీప్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్పై భారత్ 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాను కట్టడి చేయడంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ మళ్లీ టెస్టుల్లోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించానని, అలాగే రిథమ్పైనా దృష్టిపెట్టినట్లు తెలిపాడు. బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ కీలకమైన 40 పరుగులు చేశాడు.
‘‘నా ప్రదర్శనతో ఎంతో సంతోషంగా ఉన్నా. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు రాణించడం బాగుంది. రెండో ఇన్నింగ్స్తో పోలిస్తే తొలి ఇన్నింగ్స్లో పిచ్ కాస్త వేగంగా అనిపించింది. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసేందుకు కష్టతరంగా మారింది. అయితే నా రిథమ్పై దృష్టిపెట్టి దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించా’’ అని కుల్దీప్ వెల్లడించాడు. కెరీర్లో మూడోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కుల్దీప్.. బంగ్లాదేశ్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకొన్నాడు. రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. చివరి టెస్టు గురువారం (డిసెంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని