World Boxing Championship: మహిళల బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో నీతూకు స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం వరించింది. 48 కేజీల విభాగంలో నీతూ గంగాస్‌ మంగోలియా బాక్సర్‌పై విజయం సాధించింది.

Published : 25 Mar 2023 19:14 IST

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ను స్వర్ణం వరించింది. 48 కేజీల విభాగంలో బాక్సర్‌ నీతూ గంగాస్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో మంగోలియా బాక్సర్‌ లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీ, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతు.. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ తాజాగా తన సత్తా చాటింది. భారత్‌కు చెందిన మేరీకోమ్‌ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ, నిఖత్‌ జరీన్‌ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ సైతం చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని