Bumrah: బుమ్రా ఆ ఏడు మ్యాచ్లు ఆడకపోతే.. ప్రపంచమేమీ అంతంకాదు: ఆకాశ్ చోప్రా
టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022).. ఆసీస్తో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy).. వెన్ను నొప్పి కారణంగా ఇలాంటి మెగా టోర్నీల్లో ఆడని బుమ్రా (Bumrah).. ఐపీఎల్లో (IPL 2023) ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) దాదాపు ఆరు నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలోనూ ఆడలేదు. అయితే, మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో, సోషల్ మీడియా వేదికగా బుమ్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత్ (Team India) తరఫున ఆడేందుకు మాత్రం ఫిట్నెస్ ఉండదు కానీ, ఐపీఎల్లో పాల్గొనడానికైతే మాత్రం గాయాలు అడ్డురావనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాడు ఆకాశ్ చోప్రా (Akash Chopra) కీలక వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన అంతర్జాతీయ ఈవెంట్లకు బుమ్రా పూర్తిస్థాయి ఫిట్గా ఉండాలని బీసీసీఐ భావిస్తే.. బుమ్రాను ముంబయి ఇండియన్స్ కొన్ని మ్యాచ్లకు వదిలేస్తే మంచిదని పేర్కొన్నాడు.
‘‘నువ్వు మొదట భారత్ తరఫున ఆటగాడివి.. ఆ తర్వాతే ఫ్రాంచైజీ ప్లేయర్. అందుకే, ఫిట్నెస్కు సంబంధించి బుమ్రాకు అసౌకర్యంగా అనిపిస్తే బీసీసీఐ తక్షణమే ఫ్రాంచైజీతో సంప్రదింపులు జరపాలి. అతడు ఆడేందుకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పాలి. బుమ్రా లేకుండా జోఫ్రా ఆర్చర్తో ముంబయి తొలి ఏడు మ్యాచ్లను ఆడితే ప్రపంచమేమీ ఆగిపోదు. పూర్తిస్థాయిలో ఫిట్గా ఉంటే మాత్రం, తప్పకుండా అన్ని మ్యాచ్లను ఆడొచ్చు. బుమ్రా జాతీయ ఆస్తి కాబట్టి, బీసీసీఐ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులోనూ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, అందుకే ఎంపిక చేయలేదని పేర్కొంది. జూన్లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నాటికి పూర్తిగా ఫిట్నెస్ సాధించాలని భారత్ ఆశిస్తోంది. ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ కూడా జరగబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..