WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ ఖరారు.. ఇంకా తేలని బెర్తులు
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) తేదీ ఖరారు అయింది. జూన్ 7-11 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ని నిర్వహించున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) (WTC Final)ఫైనల్ తేదీని ఐసీసీ ఖరారు చేసింది. జూన్ 7-11 మధ్య లండన్లోని ది ఒవెల్ మైదానంలో ఈ మ్యాచ్ని నిర్వహించనున్నారు. జూన్ 12 తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. 2025 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు కూడా ఇదే మైదానంలో జరగనుంది. ఇదిలా ఉండగా.. 2022-23 డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో (2022-23) ఇంకా మూడు సిరీస్లు మిగిలి ఉన్నాయి. భారత్, ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ( Border-Gavaskar Trophy), న్యూజిలాండ్, శ్రీలంక మధ్య రెండు టెస్టులు, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు జరగాల్సి ఉంది. అయితే, ఫైనల్లో తలపడే జట్లేవో ఇంకా తేలలేదు. ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా పోటీలో ఉన్నాయి.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను బట్టి చూస్తే.. ఆస్ట్రేలియా (Australia) ఫైనల్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్తో ఆడే నాలుగు టెస్టుల్లో ఒకదానిని డ్రా చేసుకుని పెనాల్టీ పాయింట్లు పడకుండా జాగ్రత్త పడితే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. మిగతా జట్ల ఫలితాలు ఆసీస్ ఫైనల్ బెర్తుపై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. టీమ్ఇండియా ( Team India) నేరుగా ఫైనల్ చేరాలంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో 3-1 లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించాలి. ఒకవేళ అంతకంటే తక్కువ తేడాతో ఓడిస్తే భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)