WTC Finals:వారిద్దరి కెప్టెన్సీకి పరీక్ష: మైక్ హెసన్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్లు.. ఏ విధంగా తమ జట్లను ముందుండి నడిపిస్తారనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుందని
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్లు.. ఏ విధంగా తమ జట్లను ముందుండి నడిపిస్తారనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుందని కివీస్ మాజీ ప్రధాన కోచ్ మైక్ హెసన్ అన్నారు. ఈ ఇరు జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
విరాట్ కోహ్లీ, విలియమ్సన్ల కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ..‘వారిద్దరూ చాలా మంచి కెప్టెన్లు. కెప్టెన్సీలో ఇద్దరిది భిన్నమైన శైలి. ఆటగాళ్లు వారిని అనుసరించాలనుకుంటున్నారు. ఇది ఏ కెప్టెన్కైనా గొప్ప గుర్తింపు. విలియమ్సన్... ఓపికతో ఉంటూ నిర్ణీత సమయంలో ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తాడు. విరాట్ ఇందుకు పూర్తి భిన్నం. నిరంతరం ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు’ అని హెసన్ అన్నాడు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్ విలియమ్సన్, విరాట్ కోహ్లీల కెప్టెన్సీకి పరీక్ష లాంటిది. రోజురోజుకూ పిచ్(వికెట్) పరిస్థితులు మారుతున్నప్పడు వారు తమ వ్యూహాలలో చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తూ ఎలా ముందుకు వెళతారనే ఆసక్తికరంగా ఉంటుంది. టీమ్ఇండియా టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్.. న్యూజిలాండ్ బౌలర్ల స్వింగ్ బంతులను ఎలా ఎదుర్కొంటారో చూడాలని ఉత్సుకతతో ఉన్నా. న్యూజిలాండ్ బౌలర్లను టీమ్ఇండియా టాప్ఆర్డర్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించొచ్చు’ అని మైక్ హెసన్ ముగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..