WTC Final:ఆ జట్టుకే కాస్త ఎక్కువ అవకాశం: బ్రెట్ లీ
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పైనే ఉంది. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్. ఇందులో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఫైనల్కు చేరిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పైనే ఉంది. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్. ఇందులో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఫైనల్కు చేరిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య ఈ పోరు జరగనుంది. ఈ రెండు జట్లూ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండటంతో ఏ జట్టు కప్ని ముద్దాడుతుందోనన్న చర్చ మొదలైంది. పలువురు క్రికెటర్లు భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తుంటే, మరికొంత మంది కివీస్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్బౌలర్ బ్రెట్ లీ కూడా తన అంచనాను బయటపెట్టాడు. ఈ ఫైనల్లో భారత్ కంటే విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్కే విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
‘ఇంగ్లాండ్ పిచ్లు కివీస్కు సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడి పిచ్పై వారు బ్యాటింగ్ చేస్తుంటే అది వారి స్వదేశంలో ఆడినట్టుగా ఉంటుంది. ఈ మ్యాచ్లో బౌలింగ్ కీలకంగా మారనుంది. ఫాస్ట్బౌలింగ్కు ఈ పిచ్స్వింగ్ అనుకూలంగా ఉండొచ్చు. వీటన్నింటిని పరిశీలిస్తే న్యూజిలాండ్కే కాస్త ఎక్కువ అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే, ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు స్వింగ్ బౌలింగ్ని బాగా ఆడగలరు. బౌలింగ్లో ఏ జట్టు ఉత్తమ ప్రదర్శన ఇస్తుందో ఆ జట్టే ఇందులో విజయం సాధిస్తుంది’ అని బ్రెట్ లీ అన్నాడు.
విరాట్ కోహ్లీ, విలియమ్సన్ కెప్టెన్సీల గురించి మాట్లాడుతూ..‘కేన్ విలియమ్సన్కు గొప్ప క్రికెట్ బ్రెయిన్ ఉంది. అంతేకాకుండా బోరింగ్ లేని కెప్టెన్. అవసరమున్నప్పుడు మాత్రమే బ్రెయిన్కి పదును పెట్టి ఆలోచిస్తాడు. ఓపిక కూడా ఎక్కువ. అది అతనికి, కివీస్కు అనుకూలంగా మారుతుంది. విరాట్ కోహ్లీ దూకుడైన కెప్టెన్. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అని చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను సంప్రదాయ, దూకుడైన కెప్టెన్ల కింద ఆడాను’ అని బ్రెట్ లీ ముగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.