WTC Final: కోహ్లీసేన ‘5’ శత్రువులు
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు మరో నాలుగు రోజులే ఉంది. ఇంగ్లాండ్ను 1-0తో మట్టికరిపించిన న్యూజిలాండ్ ఉత్సాహంతో ఉంది. టీమ్ఇండియాతో పోరులో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్కు.. కివీస్ చేతిలో మాత్రం ఓటములు తప్పడం...
టీమ్ఇండియా.. ఆదమరిస్తే అంతే సంగతులు!
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు మరో నాలుగు రోజులే ఉంది. ఇంగ్లాండ్ను 1-0తో మట్టికరిపించిన న్యూజిలాండ్ ఉత్సాహంతో ఉంది. టీమ్ఇండియాతో పోరులో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్కు.. కివీస్ చేతిలో మాత్రం ఓటములు తప్పడం లేదు. అందుకే తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్షిప్ గెలవాలంటే కోహ్లీసేన ప్రత్యర్థిని కట్టడి చేయక తప్పదు. ఆ ఐదుగురు శత్రువులను అడ్డుకోక తప్పుదు. ఇంతకీ వారెవరు?
ప్రధాన శత్రువు సౌథీ
ఫైనల్లో కోహ్లీసేన ప్రధాన శత్రువు ‘టిమ్ సౌథీ’. టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన అతడు టాప్-5లో నిలిచాడు. కివీస్ విజయాలకు కారణం అతడి బౌలింగే! అత్యంత వేగంతో పదునైన బంతులు విసరగలడు. పిచ్లతో సంబంధం లేకుండా రాణించగలడు. పక్కాగా వలపన్ని ప్రత్యర్థిని ఉచ్చులో పడేయడం సౌథీ ప్రత్యేకత. భారత్పై అతడికి మంచి రికార్డుంది. 8 మ్యాచుల్లో 24.46 సగటుతో 39 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై 6 మ్యాచుల్లో 28.37 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి అతడి బౌలింగ్ను ఎదుర్కోవడం కోహ్లీసేనకు సులువేమీ కాదని అర్థమవుతోంది. మొన్నటి లార్డ్స్ మ్యాచులో 7 వికెట్లు తీసి హడలెత్తించాడు. పైగా కోహ్లీపై అతడిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు 10సార్లు అతడిని ఔట్ చేశాడు. షార్ట్పిచ్లో బంతులేసి బ్యాక్ఫుట్తో ఆడేలా చేస్తాడు. ఆపై దేహానికి దూరంగా బంతిని కాస్త ఫుల్ చేసి డ్రైవ్ చేసేలా ఉసిగొల్పి కోహ్లీని బుట్టలో పడేస్తాడు. అందుకే అతడితో జాగ్రత్త తప్పదు.
ప్రియమైన శత్రువు కేన్
సారథి విరాట్ కోహ్లీ, టీమ్ఇండియాకు ‘ప్రియమైన శత్రువు’ కివీస్ సారథి కేన్ విలియమ్సన్. ఇంగ్లాండ్తో రెండు టెస్టుల్లో అతడు పరుగులేమీ చేయలేదు. అలాగని మరేం ఫర్వాలేదనుకోవద్దు. కోహ్లీ తరహాలోనే కీలక మ్యాచుల్లో రాణించడం.. ఒత్తిడిలో ప్రశాంతంగా ముందుకు సాగడం.. కనిపించకుండానే విధ్వంసం సృష్టించడం కేన్ ప్రత్యేకత. భారత్పై చెలరేగడం అతడికి అలవాటే. టీమ్ఇండియాపై 11 టెస్టుల్లో 36.40 సగటుతో 728 పరుగులు చేశాడు. 2 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టుల్లో 26.10 సగటుతో 261 పరుగులే చేశాడు. ఇంగ్లిష్ వాతావరణంలో పెద్దగా పరుగులు చేయకపోవడం సానుకూలాంశమే అయినా ఆదమరిస్తే ప్రమాదం తప్పదు. ఎందుకంటే తటస్థ వేదికపై ఇద్దరికీ అవకాశాలు సమంగానే ఉంటాయి. అతడు పేస్తో పాటు స్పిన్నూ సమర్థంగా ఎదుర్కోగలడు. అశ్విన్, బుమ్రా అతడిని నిలవకుండా అడ్డుకోవాలి.
కొత్త శత్రువు కాన్వే
టీమ్ఇండియా ఎదుర్కోబోతున్న కొత్త శత్రువు ‘డేవాన్ కాన్వే’. అటు స్పిన్ ఇటు పేస్ను సమర్థంగా ఆడటం ఈ కివీస్ ఓపెనర్ ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్లోకి కొత్తగా వచ్చానన్న బెరుకే అతడిలో కనిపించడం లేదు. ఇంగ్లాండ్తో 2 టెస్టుల సిరీసులో టాప్ స్కోరర్గా నిలిచాడు. 4 ఇన్నింగ్స్ల్లో 76.50 సగటు, 54.84 స్ట్రైక్రేట్తో 306 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్లో ద్విశతకం చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఆడింది 3 వన్డేలే. 75 సగటు, 88.23 స్ట్రైక్రేట్తో 225 పరుగులు బాదేశాడు. 11 టీ20 ఇన్నింగ్సుల్లో 59.12 సగటుతో 473 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే కాన్వేను ఔట్ చేయడం సులభం కాదు. అందులోనూ టీమ్ఇండియా స్పిన్ ద్వయాన్ని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాడట. వీలైనంత త్వరగా ఈ ఓపెనర్ను పెవిలియన్ పంపించకపోతే అంతే సంగతులు!
బోల్తా కొట్టించే శత్రువు బౌల్ట్
న్యూజిలాండ్కు టిమ్ సౌథీతో పాటు దొరికిన మరో అద్భుతమైన పేసర్ ట్రెంట్ బౌల్ట్. బ్యాటింగ్లో కుడి, ఎడమ కూర్పులా.. బౌలింగ్లో సౌథీ కుడిచేత్తో.. బౌల్ట్ ఎడమచేత్తో ప్రత్యర్థిని శాసిస్తారు. విభిన్నమైన కోణాల్లో బంతిని వేగంగా విసరడం.. బ్యాట్స్మెన్ మీదకు దూసుకొచ్చే ఇన్స్వింగర్లు వేయడం బౌల్ట్ ప్రత్యేకత. ఇంగ్లాండ్ వంటి దేశాల్లో టీమ్ఇండియా టాప్ఆర్డర్ బలహీనతను అతడు సొమ్ము చేసుకోగలడు! అందుకే బౌల్ట్ను ఆచితూచి ఎదుర్కోవడం కోహ్లీసేనకు అవసరం. టీమ్ఇండియాపై 9 టెస్టులాడిన అతడు 29.52 సగటుతో 36 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్లో 5 టెస్టుల్లోనే 22.40 సగటుతో 27 వికెట్లు తీయడం గమనార్హం. మరో ఎండ్లో ఇంకెవరైనా ఒత్తిడి చేస్తుంటే.. ఇంకో ఎండ్లో బౌల్ట్ ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అందుకే సౌథీతో కలిసినప్పుడు అతడిని ఎదుర్కోవడం కష్టం. రోజ్బౌల్లో చల్లని వాతావరణం ఉంటే బౌల్ట్ను అడ్డుకోవడం బ్యాటు మీద సామే!
నివురు గప్పిన శత్రువు హెన్రీ
అగ్నికి ఆజ్యం తోడైతే... నానుడి తెలిసిందే. కివీస్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్ అగ్ని అనుకుంటే ఆజ్యం ‘మ్యాట్ హెన్రీ’! దొరికిన అవకాశాలు తక్కువే ఐనా నిలకడగా అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సిబ్లీ, రూట్, మార్క్వుడ్ ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో వరుసగా రోరీ బర్న్స్ (0), సిబ్లీ (8), జాక్ క్రాలీ (17)ని 30 పరుగుల్లోపే పెవిలియన్ పంపించి విజయంలో కీలకంగా మారాడు. బౌల్ట్, సౌథీ విఫలమైన పక్షంలో వారి పాత్రలను హెన్రీ పోషిస్తాడు. 140 కి.మీ వేగంతో బంతులను స్వింగ్ చేసే అతడికి ఇంగ్లాండ్ వాతావరణం నప్పుతుంది. 2019 వన్డే ప్రపంచకప్లో కివీస్ ఫైనల్ చేరడంలో 14 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. హెన్రీ బౌలింగ్లో జాగ్రత్తగా ఆడటం కోహ్లీసేనకు అవసరం. లేదంటే ప్రపంచకప్ సెమీస్లో రోహిత్ (1), రాహుల్ (1) ఔటైన పరిస్థితులను అతడు సృష్టించగలడు. అంచనాలన్నీ బౌల్ట్, సౌథీపై ఉంటాయి కాబట్టి చాప కింద నీరులా హెన్రీ వికెట్లు తీసేస్తుంటాడు. టీమ్ఇండియాపై అతడు 2 టెస్టుల్లో 6 వికెట్లు, ఇంగ్లాండ్లో 3 టెస్టులాడి 14 వికెట్లు తీశాడు. సొంత దేశంలో (13) కన్నా ఇంగ్లాండ్లోనే ఓ వికెట్ ఎక్కువ తీయడం గమనార్హం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్