IND vs NZ: లఖ్నవూ పిచ్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో పిచ్ ప్రభావం వల్ల ఇరుజట్లు భారీ స్కోర్ సాధించలేకపోయాయి. లఖ్నవూ పిచ్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ పిచ్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20ల్లో ఇలాంటి పిచ్ ఉండకూడదన్నాడు. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో పిచ్ ప్రభావం వల్ల ఇరుజట్ల బ్యాటర్లు భారీ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 99 పరుగులే చేయగలిగింది. భారత్ విజయం సాధించినప్పటికీ లక్ష్య ఛేదనలో తీవ్రంగా ఇబ్బందిపడింది.
‘‘లఖ్నవూ పిచ్ కొంచెం కూడా బాగోలేదు. టీ20ల్లో ఇలాంటి పిచ్ ఉండకూడదు. ఆట అన్నాక కొంచెం కఠినంగా, ఛాలెంజింగ్గా ఉండాలి. కానీ ఇది అంతకు మించి ఉంది. ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతి జారిపోతుంది. స్పిన్నర్లు వేసే బంతి ఎక్కువ బౌన్స్ అవుతుంది. అటువంటి పిచ్లో బ్యాటర్లు ఎప్పటికీ స్థిరపడలేరు. ఇరుజట్ల బ్యాటర్లు రనౌట్ అయ్యారు. ఇలాంటి పిచ్లపై ఆడేటప్పుడు ఆటగాళ్లకు అయోమయంగా ఉంటుంది. భారీ షాట్లు ఆడాలో? వద్దో? కూడా అర్థం కాదు. బౌన్సర్ను ఎదుర్కోవడానికి స్వీప్ లేదా రివర్స్ స్వీప్ ఆడతారు. శుభ్మన్గిల్, రాహుల్ త్రిపాఠీ సైతం అలాగే ప్రయత్నించి ఔటయ్యారు’’ అని పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్లో ఇరు జట్లూ 1-1తో సమంగా ఉంది. సిరీస్ విజేతను తేల్చే మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్లో జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.