Virat Kohli : నేనెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తా : విరాట్ కోహ్లీ
ఇటీవల టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికిన విరాట్ కోహ్లీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకి లీడర్గా కొనసాగేందుకు.. కెప్టెన్సీతో అవసరం లేదని అన్నాడు. జట్టులో సాధారణ...
ఇంటర్నెట్ డెస్క్ : ఇటీవల టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికిన విరాట్ కోహ్లీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకి లీడర్గా కొనసాగేందుకు.. కెప్టెన్సీతో అవసరం లేదని అన్నాడు. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తానని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘జట్టులో నాయకుడిగా ఉండటానికి.. కెప్టెన్సీతో అవసరం లేదు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అతడి స్థాయి తగ్గలేదు. జట్టులో కొనసాగినంత కాలం అతడి నుంచి సలహాలు తీసుకునే వాళ్లం. కెప్టెన్సీని వదిలేసి ముందుకు సాగడం కూడా నాయకుడి లక్షణమే. కాకపోతే, మన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సరైన సమయాన్ని ఎంచుకోవాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నాను. గతంలో ధోని కెప్టెన్సీలో నేను ఆడాను. ఆ తర్వాత కెప్టెన్గా పని చేశాను. అప్పుడూ, ఇప్పుడూ నా మైండ్సెట్ ఓకేలా ఉంది. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. నేనెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తా. గెలుపోటములు అనేవి మన చేతుల్లో లేవు. కానీ, జట్టు కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి. భారత జట్టు సంస్కృతిని మార్చడం చాలా కష్టమైన విషయం. నేను కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించాను. జట్టునెప్పుడూ అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశాను. ఎవరికైనా వారి లక్ష్యాలపై పూర్తి అవగాహన ఉండాలి. మన కెరీర్ ముగిసేలోపు వాటిని సాధించామా? లేదా? అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి దానికి ఓ ముగింపు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. అప్పుడే, జట్టులో మన పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు..
‘జట్టులో మన పాత్ర ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మన బాధ్యతలు ఏంటో.. మన పాత్రకు ఏ మేరకు న్యాయం చేయగలిగామో తెలుస్తుంది. జట్టులో నా పాత్రేంటో నాకు తెలుసు. వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ అభిప్రాయంతో నాకు సంబంధం లేదనే ధోరణి సరికాదు. ఏ విషయాన్ని అయినా గౌరవప్రదంగా చెప్పాలి. ఏ కష్టమొచ్చినా.. మనల్ని సంప్రదించేలా ఉండాలి. నేను అలాగే చేసే వాడిని. టీమ్ఇండియాలో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదువలేదు. నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి వారిని మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దాలి. అందుకోసం ప్రతి రోజూ కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అదో నిరంతర ప్రక్రియ. నేను భారత కెప్టెన్గా.. ఆటగాళ్లలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవగలమనే నమ్మకాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను’ అని కోహ్లీ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్