Ravindra Jadeja : కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జడేజాకు అవమానంగా ఉందేమో: షేన్ వాట్సన్
చెన్నై కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు. జడేజాపై జాలి కలుగుతోందన్నాడు.......
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్ గత సీజన్ విజేత చెన్నై ఈసారి అంచనాలను అందుకోలేకపోతోంది. సీజన్ ప్రారంభంలో కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టును సమర్థంగా నడిపించలేకపోయాడు. నాయకత్వ భారం పడుతుండటంతో ఆ పదవి నుంచి తప్పుకోగా.. దీంతో ఆ బాధ్యతలను మళ్లీ ధోనీ అందుకున్నాడు. అయితే కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు. జడేజాపై జాలి కలుగుతోందన్నాడు. అతడికి ఇది అవమానకరంగా అనిపిస్తోందేమోనని పేర్కొంటూ అండగా నిలిచాడు.
‘ధోనీ లాంటి గొప్ప నాయకుడి నుంచి చెన్నై పగ్గాలను జడేజా అందుకోబోతున్నాడని తెలిసి చాలా సంతోషించా. చరిష్మా ఉన్న కెప్టెన్ నుంచి ఆ బాధ్యలు స్వీకరించడమంటే సవాలుతో కూడుకున్న విషయం. జడేజా గొప్ప వ్యక్తి. తనను తాను మెరుగుపరుచుకుంటున్న అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్. కానీ ప్రస్తుతం అతడి పరిస్థితి చూస్తే బాధగా ఉంది. తనను తాను ఈ స్థితిలో చూసుకునేందుకు ఇష్టపడటంలేదేమో. ఒత్తిడి ఉన్నప్పుడు కెప్టెన్సీని వదులుకోవడం క్లిష్టమైన అంశం. దీన్ని అవమానకరంగా భావిస్తాం. రాజస్థాన్ బట్టు బాధ్యతల నుంచి వైదొలిగినప్పుడు నేనూ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నా. జడేజా ఈ నిర్ణయం తీసుకోవడం.. అతడి గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అతడికి నా అభినందనలు. ఏదిఏమైనప్పటికీ.. సరైన సమయంలో ధోనీ మళ్లీ జట్టు పగ్గాలను అందుకున్నాడు’ అని వాట్సన్ పేర్కొన్నాడు.
జడేజా సారథ్యంలోని చెన్నై ఈ సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు ఓటములు నమోదుచేసింది. మరోవైపు తన ప్రదర్శనపై నాయకత్వ భారం పడుతోందని జడ్డూ భావించాడు. ఈ నేపథ్యంలోనే అతడు కెప్టెన్సీని వదులుకున్నాడు. ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో జడ్డూ 116 పరుగులు చేసి, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అనంతరం ధోనీ నాయకత్వంలో మొదటి మ్యాచ్లోనే ప్రత్యర్థి హైదరాబాద్పై చెన్నై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. రేపు దిల్లీతో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్