Virat Kohli: కోహ్లీ సర్.. మిమ్మల్ని చూడ్డానికి స్కూల్కు డుమ్మాకొట్టి వచ్చాను
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా ఫాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అది రోజురోజుకీ పెరిగిపోతోంది...
వార్మప్ మ్యాచ్లో చిన్నారి అభిమాని ఫొటో వైరల్
(Photo: Johns Twitter )
లీసెస్టర్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అది రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకు నిదర్శనమే ఇటీవల అతడి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరడం. దీంతో కోహ్లీకి భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని అర్థమవుతోంది. అతడు ఎక్కడికెళ్లినా జనం ఎగబడతారు. అతడిని దగ్గరి నుంచి చూడ్డానికి, వీలైతే ఫొటోలు, ఆటోగ్రాఫ్లు తీసుకోడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఇంగ్లాండ్లోనూ విరాట్కు అభిమానుల తాకిడి తగ్గడం లేదు.
లీసెస్టర్ జట్టుతో గురువారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్లో ఓ వీరాభిమాని ప్రత్యేకంగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ మ్యాచ్లో తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లీని చూడ్డానికి ఓ స్కూల్ విద్యార్థి స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆ బుడతడు పట్టుకున్న ప్లకార్డు ఒకవైపు నవ్వులు తెప్పిస్తూనే.. మరోవైపు కోహ్లీ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తోంది. ఆ ప్లకార్డుపై ‘విరాట్ సర్.. మీరు అత్యుత్తమ క్రికెటర్. నేను మిమ్మల్ని చూడ్డానికి స్కూల్కి డుమ్మా కొట్టి మరీ వచ్చాను’ అని రాసి ఉంది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్లో విరాట్ (33; 69 బంతుల్లో 4x4, 1x6) మరోసారి నిరాశ పరిచాడు. సుమారు రెండు గంటలపాటు క్రీజులో నిలిచిన అతడు భారీ స్కోర్ చేసేలా కనిపించాడు. ఈ క్రమంలోనే యువ బ్యాటర్ ఎస్కే భరత్(70*)తో ఆరో వికెట్కు 57 పరుగులు జోడించాడు. అయితే, చివరికి రోమన్ వాకర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయి ఔటయ్యాడు. అనంతరం టీమ్ఇండియా తొలి రోజు ఆటను 246/8తో ముగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే