Yuvraj Singh: ఆరోజు సచిన్ను 200 కొట్టనివ్వాల్సింది: యువరాజ్
2004లో పాకిస్థాన్తో జరిగిన ముల్తాన్ టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్డెస్క్: 2004లో పాకిస్థాన్తో జరిగిన ముల్తాన్ టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ ఆల్రౌండర్.. నాటి టెస్టులో జరిగిన ఆసక్తికర విషయంపై తొలిసారి స్పందించాడు. అప్పుడు జట్టు తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. 3 టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్కు వెళ్లిన భారత్ 2-1 తేడాతో గెలుపొంది తొలిసారి దాయాది గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గింది. ముఖ్యంగా ముల్తాన్లో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 675/5 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (309; 375 బంతుల్లో 39x4, 6x6) త్రిశతకం సాధించి భారత టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో సచిన్ తెందూల్కర్ (194 నాటౌట్; 348 బంతుల్లో 21x4) ద్విశతకానికి చేరువైన వేళ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కూడా తెలిసిందే. అయితే, ఈ విషయం అప్పట్లోనే సంచలనంగా మారింది. తెందూల్కర్ డబుల్ సెంచరీ సాధించకుండా ద్రవిడ్ అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ పండితులే ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై యువరాజ్ తాజాగా నోరు విప్పాడు. అప్పుడు సచిన్ను ద్విశతకం చేయనివ్వాల్సిందని అన్నాడు.
‘ఆరోజు నేనూ, సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నామని, వేగంగా పరుగులు చేయాలని జట్టు నుంచి సందేశం వచ్చింది. అప్పుడు సచిన్ ఇంకో ఓవర్ ఆడి ఉంటే ఆ 6 పరుగులూ పూర్తి చేసి ద్విశతకం సాధించేవాడు. మేం ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక 8-10 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాం. కానీ, సచిన్ 194 పరుగుల వద్ద ఉండగా ఇంకో రెండు ఓవర్లు ఆడి ఉంటే అది మ్యాచ్పై పెద్ద ప్రభావం చూపేది కాదని నేననుకుంటా. అయితే, ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను మాత్రం సచిన్ 200 కొట్టాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసుంటే బాగుండేదని అనుకున్నాను’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ మ్యాచ్లో తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 407, రెండో ఇన్నింగ్స్లో 216 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం