Yuvraj Singh: ఆ హైదరాబాద్ బ్యాట్స్మన్ నన్నే గుర్తుచేస్తున్నాడు: యువీ
హైదరాబాద్ యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ తన ఆటను గుర్తుకు తెస్తున్నాడని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: హైదరాబాద్ యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ తన ఆటను గుర్తుకు తెస్తున్నాడని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. 2004లో ముల్తాన్ టెస్టులో సచిన్ (194*) పరుగుల వద్ద ఉండగా టీమ్ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయడం దగ్గరి నాటి నుంచి గంగూలీ రిటైరయ్యాక తనకు టెస్టుల్లో అవకాశాలు వచ్చిన అనేక విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న టీ20లీగ్ 15వ సీజన్లో హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అచ్చం తనలాగే షాట్లు ఆడుతున్నాడని చెప్పాడు.
‘అభిషేక్ శర్మను చూస్తుంటే చాలా మటుకు నన్నే గుర్తుకు తెస్తున్నాడు. అతనాడే పుల్ షాట్లు, బ్యాక్ఫుట్ షాట్లు అచ్చం నేనాడే విధంగానే ఉన్నాయి. చెన్నై జట్టులోని శివమ్ దూబే కూడా ఇలాగే ఆడుతున్నాడు. కానీ, అతడు చాలా రోజులుగా క్రికెట్ ఆడుతున్నా ఇప్పటివరకు ఎన్ని వన్డేలు ఆడాడో నాకు తెలియదు. నైపుణ్యాలున్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిచ్చి ప్రోత్సహించాలి. దాంతో వారు అత్యుత్తమ క్రికెటర్లుగా తయారవుతారు’ అని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్లో అభిషేక్ ఆడిన 10 మ్యాచ్ల్లో 331 పరుగులు చేయగా.. సగటు 33.10, 134 స్ట్రైక్రేట్ కలిగి ఉన్నాడు. అలాగే శివమ్ దూబే ఆడిన 8 మ్యాచ్ల్లో 247 పరుగులు చేయగా.. సగటు 35.29, స్ట్రైక్రేట్ 159.35 సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.