Yuvraj singh: వచ్చే జన్మలో.. 12వ ఆటగాడిగా లేకుంటే..
టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మరోసారి జట్టు యాజమాన్యంపై హాస్యం కనబరుస్తూనే విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో.....
టెస్టు క్రికెట్లో మరిన్ని అవకాశాలు దొరుకుతాయేమో అన్న యువీ
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మరోసారి జట్టు యాజమాన్యంపై హాస్యం కనబరుస్తూనే విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తనకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని చెప్పకనే చెప్పాడు. బహుశా వచ్చే జన్మలో 12వ ఆటగాడిగా ఏడేళ్లు లేకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయేమోనని అన్నాడు. విజ్డెన్ ఇండియా పెట్టిన ఓ ట్వీట్కు అతడిలా జవాబిచ్చాడు.
ప్రపంచం మెచ్చిన ఆల్రౌండర్లు, మ్యాచు విజేతల్లో యువీ ఒకడన్న సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లో అతడు ఐసీసీ టైటిళ్లు అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్లో అతడి మెరుపులను ఎవ్వరూ మర్చిపోలేరు. క్యాన్సర్ బాధిస్తున్నా.. కడుపు నొప్పి వేధిస్తున్నా అతడు జట్టుకు అండగా నిలిచాడు. బ్యాటు, బంతితో రాణించాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్లో అతడు చెలరేగిన తీరు.. ఆరు సిక్సర్లు కొట్టిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో విపరీతంగా ఆడిన యువీకి టెస్టు క్రికెట్లో తగినన్ని అవకాశాలు రాలేదు. 40 టెస్టులు మాత్రమే ఆడాడు.
‘టీమ్ఇండియాలో ఏ క్రికెటర్ మరిన్ని టెస్టు మ్యాచులు ఆడాల్సిందని మీరు కోరుకుంటున్నారు?’ అని విజ్డెన్ ఇండియా ట్విటర్లో ప్రశ్నించింది. అభిమానులతో పాటు యువీ సైతం ఈ ట్వీట్కు స్పందించాడు. ‘బహుశా వచ్చే జన్మలో! అదీ జట్టులో 12వ ఆటగాడిగా ఏడేళ్లు లేనప్పుడు’ అని భిన్నంగా బదులిచ్చాడు. జట్టు యాజమాన్యం తుది జట్టులో తీసుకోలేదని పరోక్షంగా విమర్శించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం