యూజీ సంగీత్లో ధావన్ చిందులు
టీమ్ఇండియా ‘అల్లరి పిల్లాడు’ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఓ ఇంటి వాడయ్యాడు. డిసెంబర్ 23న ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి దుబాయ్లో హనీమూన్ ట్రిప్ ఆస్వాదిస్తున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన తన వివాహవేడుక చిత్రాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ‘అల్లరి పిల్లాడు’ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఓ ఇంటి వాడయ్యాడు. డిసెంబర్ 23న ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి దుబాయ్లో హనీమూన్ ట్రిప్ ఆస్వాదిస్తున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన తన వివాహవేడుక చిత్రాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ‘సంగీత్’కు సంబంధించిన చిత్రాలను పోస్ట్చేశాడు. ‘ఈ ఏడాది (2020) అత్యంత ఆసక్తి రేపిన, ఉత్సాహకరమైన ప్రదర్శనలివే’ అంటూ వ్యాఖ్య జత చేశాడు. అతడి సతీమణి ధనశ్రీ సైతం మరికొన్ని చిత్రాలను పోస్ట్ చేయడం గమనార్హం.
తన మణికట్టు మాయాజాలంతో పలుదేశాల క్రికెటర్లను పెవిలియన్కు పంపించిన యూజీకి లాక్డౌన్లో పెళ్లి కుదిరింది. అప్పుడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్కు వచ్చిన యూజీని చూసేందుకు ధనశ్రీ సైతం రావడం గమనార్హం. లీగ్ ముగిసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో ఉండటంతో సహచరులెవరూ పెళ్లికి హాజరుకాలేదు. శిఖర్ ధావన్ మాత్రం సంగీత్ వేడుకకు వచ్చి చిందులు వేశాడు. రెండు రోజుల క్రితమే నూతన దంపతులు ఎంఎస్ ధోనీ, సాక్షిసింగ్ ఆతిథ్యాన్ని స్వీకరించడం గమనార్హం.
ఇవీ చదవండి
అనుకున్నామా.. అమ్మాయిల కోసం ఏడుస్తామని!
వార్నర్ దశావతారం..హార్దిక్ హ్యాపీ హ్యాపీ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!