యూజీ సంగీత్‌లో ధావన్‌ చిందులు

టీమ్‌ఇండియా ‘అల్లరి పిల్లాడు’ యుజ్వేంద్ర చాహల్‌ ఈ మధ్య ఓ ఇంటి వాడయ్యాడు. డిసెంబర్‌ 23న ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి దుబాయ్‌లో హనీమూన్‌ ట్రిప్‌ ఆస్వాదిస్తున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన తన వివాహవేడుక చిత్రాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా...

Published : 01 Jan 2021 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ‘అల్లరి పిల్లాడు’ యుజ్వేంద్ర చాహల్‌ ఈ మధ్య ఓ ఇంటి వాడయ్యాడు. డిసెంబర్‌ 23న ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి దుబాయ్‌లో హనీమూన్‌ ట్రిప్‌ ఆస్వాదిస్తున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన తన వివాహవేడుక చిత్రాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ‘సంగీత్’కు సంబంధించిన చిత్రాలను పోస్ట్‌చేశాడు. ‘ఈ ఏడాది (2020) అత్యంత ఆసక్తి రేపిన, ఉత్సాహకరమైన ప్రదర్శనలివే’ అంటూ వ్యాఖ్య జత చేశాడు. అతడి సతీమణి ధనశ్రీ సైతం మరికొన్ని చిత్రాలను పోస్ట్‌ చేయడం గమనార్హం.

తన మణికట్టు మాయాజాలంతో పలుదేశాల క్రికెటర్లను పెవిలియన్‌కు‌ పంపించిన యూజీకి లాక్‌డౌన్‌లో పెళ్లి కుదిరింది. అప్పుడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌కు వచ్చిన యూజీని చూసేందుకు ధనశ్రీ సైతం రావడం గమనార్హం. లీగ్‌ ముగిసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో ఉండటంతో సహచరులెవరూ పెళ్లికి హాజరుకాలేదు. శిఖర్ ధావన్‌ మాత్రం సంగీత్‌ వేడుకకు వచ్చి చిందులు వేశాడు. రెండు రోజుల క్రితమే నూతన దంపతులు ఎంఎస్‌ ధోనీ, సాక్షిసింగ్‌ ఆతిథ్యాన్ని స్వీకరించడం గమనార్హం.

ఇవీ చదవండి
అనుకున్నామా.. అమ్మాయిల కోసం ఏడుస్తామని!
వార్నర్‌ దశావతారం..హార్దిక్‌ హ్యాపీ హ్యాపీ!

 






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని