CoronaVirus: భారత జట్టులో మరో ఇద్దరికి కరోనా!

శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా జట్టులో తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ కాగా మరొకరు కృష్ణప్ప గౌతమ్‌ అని తెలిసింది...

Updated : 20 Sep 2022 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా జట్టులో తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ కాగా మరొకరు కృష్ణప్ప గౌతమ్‌ అని తెలిసింది. వీరిద్దరికి వైరస్‌ నిర్ధరణ అయినట్లు అక్కడి అధికారులు మీడియాకు చెప్పారు. ఇటీవల రెండో టీ20కు ముందు కృనాల్‌ పాండ్య తొలుత వైరస్‌ బారినపడ్డాడు. అతడితో సన్నిహితంగా ఉన్న మరో ఎనిమిది మంది ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించారు. అందులో చాహల్‌, కృష్ణప్ప ఉండటం గమనార్హం. దాంతో వారిద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే వారిద్దరూ గత రెండు టీ20ల్లో ఆడలేకపోయారు. మరోవైపు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా టీమ్‌ఇండియా చివరి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొని షెడ్యూల్‌ను అనుకున్నట్లే పూర్తి చేసింది. అయితే, 2-1 తేడాతో సిరీస్‌ కోల్పోయింది. ఇక పాజిటివ్‌గా తేలిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీలంకలో ఉంటుండగా మిగతా జట్టు సభ్యులు నేడు భారత్‌కు తిరిగొస్తున్నారు. అంతకుముందు టీమ్‌ఇండియా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని