పంత్ను ఆటపట్టించిన చాహల్, రషీద్
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ను యుజువేంద్ర చాహల్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ఖాన్ ట్రోల్ చేశారు. తాజాగా పంత్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో పంచుకోగా, అందులో ఎర్ర రంగు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ను యుజువేంద్ర చాహల్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ఖాన్ ట్రోల్ చేశారు. తాజాగా పంత్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో పంచుకోన్నాడు. ఆ ఫొటోలో ఎర్ర రంగు టీషర్ట్ ధరించాడు. దాని మీద ‘టామ్ అండ్ జెర్రీ’ కార్టూన్ బొమ్మ ఉండడంతో పంత్ పోస్టు చేస్తూ ఇలా అన్నాడు. ‘మీలో ఎంతమంది ఈ కార్టూన్ను చూశారు?’ అని ప్రశ్నించాడు.
ఆ పోస్టు చూసిన చాహల్ స్పందిస్తూ ‘నిన్ను చూడటమా (పంత్ను కార్టూన్ బాయ్గా సంభోదించడం) లేక టామ్ అండ్ జెర్రీని చూడటమా?’ అని సరదాగా గేలి చేశాడు. ఆపై రషీద్ఖాన్ కూడా అంతే సరదాగా కామెంట్ చేశాడు. ‘నేను చాలాసార్లు నిన్నూ చూశాను, ఆ టామ్ను చూశాను’ అని పేర్కొన్నాడు. కాగా, వీరిద్దరి కామెంట్లకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాహల్ కామెంట్ను సుమారు 15 వేల మంది లైక్ చేయగా, రషీద్ కామెంట్ను 4 వేల మందికిపైగా ఇష్టపడ్డారు.
పంత్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టులో 89* పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేసి జట్టుకు చారిత్రక విజయం అందించాడు. దాంతో ఒక్కసారిగా పంత్ హీరో అయ్యాడు. ఈ సిరీస్కు ముందు పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకున్న అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది లాక్డౌన్ను సద్వినియోగం చేసుకున్నట్లు పంత్ తాజాగా చెప్పాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో హాయిగా గడపడంతో ఒత్తిడిని అధిగమించానని అన్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో బాగా ఆడినట్లు వివరించాడు.
ఇవీ చదవండి..
అంతకంటే గొప్పేముంటుంది?
ఘనతంతా కుర్రాళ్లదే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.