Yuzvendra Chahal: చాహల్ తొలి ‘హ్యాట్రిక్’.. ఆటపట్టించిన సతీమణి
కోల్కతాలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ చాహల్ అద్భుతం చేశాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సందర్భంగా చాహల్ను
ఇంటర్నెట్డెస్క్: కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుతం చేశాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, మ్యాచ్ అనంతరం అతడి సతీమణి ధనశ్రీ వర్మ ఇంటర్వ్యూ చేస్తూ సరదగా ఆటపట్టించింది. చాహల్ డగౌట్లోకి రాగా.. గ్యాలరీలో నిల్చున్న ధనశ్రీ తన భర్తను ఇలా ఇంటర్వ్యూ చేసింది.
ధన శ్రీ: నేను బయో బబుల్ నుంచి బయటకు వచ్చేశానుగా. నువ్వు ఎలా ఫీలవుతున్నావ్..?
చాహల్: చాలా అద్భుతంగా ఉంది.
ధన శ్రీ: హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నావ్.. చాలా సంతోషంగా కన్పిస్తున్నావ్..!
చాహల్: హా.. తొలి హ్యాట్రిక్ కదా అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
అదే సమయంలో ధనశ్రీ పక్కనే ఉన్న రాజస్థాన్ జట్టు ప్రతినిధులు స్పందిస్తూ.. హ్యాట్రిక్ మాత్రమే కాదు.. ఐదు వికెట్లు తీసుకున్నాడు గ్రేట్ అంటూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ జట్టు తమ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. ఇక గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ చివరి క్షణాల్లో ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. తొలుత జోస్ బట్లర్ 103 శతకంతో చెలరేగడంతో రాజస్థాన్ 217 పరుగుల భారీ స్కోర్ చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు నమోదు చేసింది. ఛేదనలో కోల్కతా మెదట దూకుడుగా ఆడినా తర్వాత నిరాశపర్చింది. ముఖ్యంగా చాహల్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ను మలుపుతిప్పాడు. 17వ ఓవర్లో అతడు హ్యాట్రిక్తో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 5 వికెట్లు సాధించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. చివరికి రాజస్థాన్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.