Chahal : లార్డ్స్లో 39 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టిన చాహల్.. రెండో వన్డే మ్యాచ్ విశేషాలు
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన ...
ఇంటర్నెట్ డెస్క్: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది. రెండో వన్డే మ్యాచ్లో భారత్ ఓడినప్పటికీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (4/47) ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 39 ఏళ్ల కిందట రికార్డును చాహల్ బద్దలు కొట్టాడు. అదేంటో చూద్దాం..
1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్కు వేదిక లార్డ్స్ స్టేడియం. విండీస్పై చిరస్మరణీయ విజయం సాధించిన కపిల్ నేతృత్వంలోని భారత్ తొలిసారి కప్ను సొంతం చేసుకుంది. అయితే విండీస్ నడ్డివిరచడంలో మొహిందర్ అమర్నాథ్ కీలక పాత్రపోషించాడు. అద్భుతమైన బౌలింగ్ స్పెల్ 3/12తో అదరగొట్టాడు. ఇదే ఇప్పటి వరకు లార్డ్స్లో ఓ భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన. అయితే తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చాహల్ (4/47) ఆ రికార్డును అధిగమించాడు.
ఈ మ్యాచ్లో మరి కొన్ని విశేషాలు..
* వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్గా టోప్లే (6/24) నిలిచాడు.
* లార్డ్స్ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా టోప్లేదే కావడం విశేషం. ఇంతకుముందు షాహీన్ అఫ్రిది (6/35) పేరిట రికార్డు ఉండేది.
* మూడేళ్ల కిందట ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్ కప్ను నెగ్గిన రోజు (జులై 14) జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం విశేషం.
* ఇప్పటి వరకు లార్డ్స్లో తొమ్మిది వన్డేలు ఆడిన భారత్.. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి, మరో నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఒక వన్డేలో ఫలితం తేలలేదు.
* లార్డ్స్ మైదానంలో భారత్ తన అత్యల్ప స్కోరు (132/3).. మరోసారి చెత్త రికార్డును నమోదు చేసే ప్రమాదం నుంచి తప్పించుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం