Yuzvendra Chahal: ‘ఓ క్రికెటర్ తాగి.. నన్ను 15వ అంతస్తులో వేలాడదీశాడు’
రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా వెన్నులో వణుకుపుట్టించే భయంకరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఇంతవరకూ ఎవరికీ తెలియని ఆ సంఘటనను రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు...
భయంకరమైన విషయం పంచుకున్న చాహల్
ఇంటర్నెట్డెస్క్: రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా వెన్నులో వణుకుపుట్టించే భయంకరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఇంతవరకూ ఎవరికీ తెలియని ఆ సంఘటనను రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2013లో ఓ క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లు పేర్కొన్నాడు. అయితే, ఆ క్రికెటర్ పేరు మాత్రం బయటపెట్టలేదు. ఈ ఇంటర్వ్యూ వీడియోను రాజస్థాన్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
‘ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకూ ఎవ్వరికీ చెప్పలేదు. ఇకపై అందరికీ తెలిసిపోతుంది. అది 2013లో నేను ముంబయి తరఫున ఆడినప్పుడు జరిగింది. బెంగళూరులో మేం ఒక మ్యాచ్ గెలిచాక పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మైకంలో ఉన్నాడు. నన్ను చాలాసేపు గమనించి తనవద్దకు రమ్మని పిలిచాడు. అతడి వద్దకు వెళ్లగానే నన్ను ఎత్తుకొని బాల్కనీలో 15వ అంతస్తులో వేలాడదీశాడు. అప్పుడు నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టుకున్నా. ఏ మాత్రం పట్టు సడలినా నా పని అయిపోయేది. వెంటనే అక్కడున్న వారు స్పందించడంతో బతికిపోయా. ఆ సమయంలో కళ్లు తిరిగి భయమేసింది. ఆ సంఘటనతో ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉండాలో తెలిసొచ్చింది. అలా నేను తృటిలో చావు నుంచి తప్పించుకున్నా. అప్పుడు ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలతో బయటపడేవాడిని కాదు’ అని చాహల్ నాటి భయంకరమైన పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నాడు.
అయితే, ఇన్ని రోజులు ఆ విషయాన్ని చాహల్ బయటపెట్టకపోవడంతో.. ఇకనైనా ఆ క్రికెటర్ ఎవరో పేరు చెప్పాలని పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కోరుతున్నారు. ముంబయి జట్టు, బీసీసీఐ ఆ క్రికెటర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2013లో ముంబయి తరఫున ఆడిన చాహల్ తర్వాత బెంగళూరు జట్టుకు వెళ్లిపోయాడు. అక్కడ కీలక స్పిన్నర్గా మంచి గుర్తింపు దక్కించుకొని ఆ జట్టులో అంతర్భాగమయ్యాడు. అయితే, ఈ సీజన్కు ముందు బెంగళూరు వదిలేయడంతో మెగా వేలంలో రాజస్థాన్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత టోర్నీలో ఆ జట్టు తరఫున ఆడుతోన్న చాహల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు తీసి రాణిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా