IND vs ZIM: విరాట్ను ఔట్ చేసే అరుదైన అవకాశం.. మా బౌలర్లు వదులుకోరు: జింబాబ్వే కెప్టెన్
ఆస్ట్రేలియా వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ సూపర్ - 12 పోటీలు చివరి దశకు చేరాయి. ఆదివారం భారత్ - జింబాబ్వే జట్ల మధ్య జరిగే మ్యాచ్ గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడందరి చూపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్పైనే.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక సూపర్ -12 దశలో జింబాబ్వేతో భారత్ ఆదివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా సెమీస్కు వెళ్లిపోతుంది. ఒక వేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే లీగ్ దశలో టీమ్ఇండియా - జింబాబ్వే మ్యాచ్ చివరిది కావడం గమనార్హం. ఈ క్రమంలో జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ ప్రెస్ కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ.. తన బౌలర్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. విరాట్ కోహ్లీని ఎదుర్కొనే అద్భుతమైన అవకాశం వచ్చిందని, మా బౌలర్లు కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
‘‘గొప్ప ఆటగాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం నిజంగా అద్భుతం. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఇదొక సదావకాశం. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసే అరుదైన అవకాశం మరోసారి ఎలా వస్తుంది..? అయితే మా ఫాస్ట్ బౌలర్లు కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం ఉంది. విరాట్ను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు ఆలోచించలేదు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో అతడు ఒకడు. పక్కా ప్రణాళికతో వెళ్లినా కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. పరిస్థితికి అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఇర్విన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!