నిధులు కేటాయించడం లేదని మోత్కూరు ఎంపీపీ రాజీనామా

ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులకు అభివృద్ధి నిధులు కేటాయించటం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ దీటీ సంధ్యారాణి(భాజపా) తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం భువనగిరిలో జడ్పీ

Published : 27 Nov 2021 04:28 IST

మోత్కూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులకు అభివృద్ధి నిధులు కేటాయించటం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ దీటీ సంధ్యారాణి(భాజపా) తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం భువనగిరిలో జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావుకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులకు రెండున్నరేళ్లుగా అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఈ కారణంగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు