కదిలిన ‘జన’శ్రేణులు.. కడలిలా కర్షకులు

‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు తోడుగా జనసేన శ్రేణులు కదం తొక్కారు.

Published : 27 Nov 2021 04:28 IST

అమరావతి రైతుల యాత్రకు నెల్లూరు నీరాజనం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు తోడుగా జనసేన శ్రేణులు కదం తొక్కారు. రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర 26వ రోజు రాజుపాళెం నుంచి నెల్లూరు వరకు 15 కి.మీ. సాగింది.  కోవూరు, నెల్లూరు నగరంలో వ్యాపారులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని సంఘీభావం తెలిపారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ యాత్రలో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన బీసీ సంఘం నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని