సచివాలయ ప్రాంగణంలో ఆలయం, చర్చి పనులు త్వరలో ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయ ప్రాంగణంలో ఆలయం, చర్చిల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆలయ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం దేవాదాయ శాఖకు అప్పగించింది.

Published : 28 Nov 2021 05:24 IST

సచివాలయ ప్రాంగణంలో నిర్మించే ఆలయం నమూనా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయ ప్రాంగణంలో ఆలయం, చర్చిల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆలయ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం దేవాదాయ శాఖకు అప్పగించింది. చర్చి నిర్మాణ బాధ్యతను సంబంధిత సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. సచివాలయ నమూనాలను రూపొందించిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్స్‌ సంస్థ ప్రార్థన మందిరాల నమూనాలూ రూపొందించింది. మసీదు నిర్మాణ పనులను గురువారమే లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. నిర్మాణ వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.


చర్చి నిర్మిస్తారిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని