గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా రాజభాను

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా రాజభాను చంద్రప్రకాశ్‌(కరీంనగర్‌), ప్రధాన కార్యదర్శిగా రాజ్‌ గంగారెడ్డి(నిజామాబాద్‌) ఎన్నికయ్యారు.

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా రాజభాను చంద్రప్రకాశ్‌(కరీంనగర్‌), ప్రధాన కార్యదర్శిగా రాజ్‌ గంగారెడ్డి(నిజామాబాద్‌) ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతినిధులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను, అవసరమున్న చోట విద్యా వాలంటీర్లను నియమించాలని, బడుల్లో మధ్యాహ్న భోజనానికి గుడ్లు సరఫరా చేయాలని, విద్యుత్తు బిల్లుల కోసం నిధులు విడుదల చేయాలని తీర్మానించారు. ఉదయం జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కాలంలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రద్ధతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని