నిలకడగా ఏపీ గవర్నర్‌ ఆరోగ్యం

కరోనా నుంచి కోలుకున్నాక తిరిగి అస్వస్థతకు గురై హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీలో చేరిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయులు సాధారణంగానే ఉన్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో కోలుకుంటారని పేర్కొన్నారు.

Published : 30 Nov 2021 05:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్నాక తిరిగి అస్వస్థతకు గురై హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీలో చేరిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయులు సాధారణంగానే ఉన్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో కోలుకుంటారని పేర్కొన్నారు.

సిరివెన్నెలకు కొనసాగుతున్న చికిత్స

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపాయి. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని