
Published : 30 Nov 2021 05:31 IST
నేడు ఆర్టీసీ రక్తదాన శిబిరాలు
దాతలకు ఉచితంగా తిరుగు ప్రయాణ సౌకర్యం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్ డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. జేబీఎస్లో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంజీబీఎస్లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శిబిరాలను ప్రారంభించనున్నారని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయా డిపోల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి సంస్థ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రక్తదాతలకు ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం ఉచితంగా తిరుగు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. రెడ్క్రాస్ సొసైటీ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తలసీమియా బాధితులకు రక్తం కొరత లేకుండా చూడడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశామని యాజమాన్యం వివరించింది.
Tags :