ముక్కలైన సేతువు.. ప్రమాద హేతువు

ఈ చిత్రం చూడండి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి - వడ్డరి రంగాపురం మధ్య పెదవాగుపై ఉన్న లోలెవల్‌ వంతెన ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ముక్కలు ముక్కలుగా

Published : 01 Dec 2021 04:39 IST

చిత్రం చూడండి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి - వడ్డరి రంగాపురం మధ్య పెదవాగుపై ఉన్న లోలెవల్‌ వంతెన ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ముక్కలు ముక్కలుగా విరిగింది. బండరాళ్లను తలపిస్తోంది. దీంతో ఈ వంతెనపై రాకపోకలు సాగించే 12 గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెద వాగుకు ఆవల వైపున్న వడ్డిర రంగాపురం, కోయ రంగాపురం నుంచి 37 మంది విద్యార్థులు రోజూ గుమ్మడవల్లి హైస్కూల్‌కు వస్తారు. వీరు నిత్యం పాఠశాలకు వెళ్లి రావడానికి ఇలా అష్టకష్టాలు పడుతున్నారు.

- న్యూస్‌టుడే, అశ్వారావుపేట గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని