కొత్తగా 193 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 193 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,76,187కు పెరిగింది. కరోనాతో ఒకరు కన్నుమూశారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,993 మంది మృతిచెందారు. తాజాగా 153 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా..

Published : 02 Dec 2021 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 193 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,76,187కు పెరిగింది. కరోనాతో ఒకరు కన్నుమూశారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,993 మంది మృతిచెందారు. తాజాగా 153 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తం 6,68,564 మంది కోలుకున్నారు. ఈ నెల 1న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 73, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 14 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని