విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం: పువ్వాడ
విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందించడంతోపాటు ఛార్జింగ్ అవసరాలు, ఇంధన నిల్వ హబ్కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందించడంతోపాటు ఛార్జింగ్ అవసరాలు, ఇంధన నిల్వ హబ్కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఈ-వాహనాలకు ప్రోత్సాహం’పై గోవాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ తరఫున ఆయన పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, పరిశ్రమల ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో జరిగిన ఈ సమావేశంలో దేశంలో విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై చర్చించారు. ఈ వాహనాల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో మంత్రి పువ్వాడ వివరించారు. ‘‘దిల్లీ, గుజరాత్ తరువాత ఈ-వాహనాలు, ఇంధన నిల్వ విధానాన్ని అమలుచేస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ఈ వాహనాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అనేక రాయితీలు, వాటి తయారీ, వినియోగానికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. 20 వేల ఆటోలు, 10 వేల తేలికపాటి రవాణా వాహనాలు, 5 వేల కార్లు, మొదటి 500 బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నాం’’ అని గోవా రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు