పరిషత్‌లకు రూ.250 కోట్ల గ్రాంటు విడుదల

రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌లకు ప్రభుత్వం రూ.250 కోట్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్‌లకు రూ.125,87,50,500

Published : 05 Dec 2021 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌లకు ప్రభుత్వం రూ.250 కోట్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్‌లకు రూ.125,87,50,500, మండల పరిషత్‌లకు రూ.124,12,49,500 నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.38,62,50,000, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.22,70,00,000 నిధులు ఉన్నాయి. నిధులను విడుదల చేయడంపై సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని