ఆ వ్యాఖ్యలకు విలువ ఉందనుకోవడం లేదు
‘మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలదించాల్సిందేనంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు విలువ ఉందని నేను అనుకోవడం లేదు’ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాసరావు వ్యాఖ్యలపై సజ్జల
ఈనాడు, అమరావతి: ‘మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలదించాల్సిందేనంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు విలువ ఉందని నేను అనుకోవడం లేదు’ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘ఎవరికి వారు ప్రెజర్ గ్రూపు అనుకుని, ఎన్నికల్లో మేం చెప్పిందే చేయగలం అంటే ఎన్నికలప్పుడు ఆ గ్రూపును సంతృప్తిపరిచి ప్రభుత్వాన్ని నిర్వహించుకోవచ్చు. ఉత్తేజం నింపేందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. లేదు అదే వారి అభిప్రాయమైతే వారూ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని రావచ్చు. ఉద్యోగులూ ప్రజల్లో భాగమే కాబట్టి వాళ్లనుకుంటే దాని ప్రభావం ఉంటుంది. ఉన్న పరిస్థితిని వారు అర్థం చేసుకుని సంయమనంతో ఉంటారని ఆశిస్తున్నాం’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్