AP News: మా మాట వినకపోతే చీరేస్తాం.. వైకాపా నేత చిందులు

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో మహిళా అధికారిణిని వైకాపా నేత దూషించారు. తాము చెప్పిందే చేయాలంటూ బెదిరించారు. ఈ ఘటనతో ఎంపీడీవో కె.ఆర్‌.విజయ కన్నీటిపర్యంతమయ్యారు. నియోజకవర్గంలోని

Updated : 07 Dec 2021 08:53 IST

ఎంపీడీవోతో వాదులాడుతున్న తాతాజీ

అయినవిల్లి న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో మహిళా అధికారిణిని వైకాపా నేత దూషించారు. తాము చెప్పిందే చేయాలంటూ బెదిరించారు. ఈ ఘటనతో ఎంపీడీవో కె.ఆర్‌.విజయ కన్నీటిపర్యంతమయ్యారు. నియోజకవర్గంలోని వైకాపా నేతల మధ్య గ్రూపుల కారణంగా, తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని భావించి... నల్లచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీ సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. ‘మేము చెప్పిన మాట వినడం లేదు, మా మాట వినకపోతే చీరేస్తాం..’ అంటూ ఎంపీడీవోపై విరుచుకుపడ్డారు. అక్కడున్న కార్యాలయ సూపరింటెండెంట్‌ దీక్షితులు వారిస్తున్నా వినకుండా తీవ్ర పదజాలంతో దూషించడంతో ఆమె విలపించారు. నేను ఇక్కడ పనిచేయడం మీకు ఇష్టం లేకపోతే ఎక్కడికైనా పంపించేయండంటూ ఆమె చెబుతున్నా తాతాజీ వినిపించుకోలేదు. తనను వైకాపా నేత దూషించారని... రక్షణ కల్పించాలని అమలాపురం ఆర్డీవో వసంతరాయుడికి ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో విజయ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని