ఏపీ హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణం నేడు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి హైకోర్టులో బుధవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వారిరువురితో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం చేయించనున్నారు.

Updated : 08 Dec 2021 05:07 IST

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి హైకోర్టులో బుధవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వారిరువురితో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. మొదటి కోర్టు హాలులో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొంటారు. అనంతరం సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు బెంచ్‌లలో పాల్గొని కేసులను విచారిస్తారు. కొత్తగా ఇద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని