ఏపీ హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణం నేడు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి హైకోర్టులో బుధవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర వారిరువురితో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం చేయించనున్నారు.
ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి హైకోర్టులో బుధవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర వారిరువురితో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. మొదటి కోర్టు హాలులో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొంటారు. అనంతరం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు బెంచ్లలో పాల్గొని కేసులను విచారిస్తారు. కొత్తగా ఇద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!