ధాన్యం లారీతో కలెక్టరేట్కు వచ్చిన ప్రభుత్వ విప్
అడిగినంత తరుగుకు అంగీకరించిన వారి ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు దించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం స్పందించారు. రైతులతో కలిసి ధాన్యం లారీని కలెక్టరేట్కు తీసుకొచ్చారు.
మిల్లర్లపై ఫిర్యాదు
కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట వడ్ల బస్తాల లారీతో ప్రభుత్వ విప్ గోవర్ధన్, రైతులు
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే: అడిగినంత తరుగుకు అంగీకరించిన వారి ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు దించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం స్పందించారు. రైతులతో కలిసి ధాన్యం లారీని కలెక్టరేట్కు తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కలిసి విషయాన్ని వివరించారు. ‘కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు సంబంధించిన 700 బస్తాల ధాన్యాన్ని ఆరు రోజుల క్రితం తూకం వేసి దేవునిపల్లిలోని ఓ రైస్మిల్లుకు పంపించారు. నాసిరకంగా ఉన్నాయని అక్కడ దించుకోలేదు. రైతులు అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు కామారెడ్డి శివారులోని మరో మిల్లుకు పంపించారు. మూడు రోజుల అనంతరం వారూ తిప్పి పంపించారు. దీంతో రైతులు నన్ను కలిశారు’ అని ఎమ్మెల్యే వివరించారు. కలెక్టర్ జోక్యంతో పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి సదరు మిల్లర్తో మాట్లాడటంతో ధాన్యం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్