బాలింతకు ‘నడక’యాతన..!

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌కు చెందిన బొర్ర సౌందర్య ఇటీవలే జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ప్రసవించారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆమెకు మంగళవారం కుట్లలోంచి రక్తస్రావం అవుతూ భరించలేని నొప్పి ప్రారంభమైంది. కుటుంబసభ్యులు హుటాహుటిన 108 అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Published : 08 Dec 2021 05:53 IST

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌కు చెందిన బొర్ర సౌందర్య ఇటీవలే జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ప్రసవించారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆమెకు మంగళవారం కుట్లలోంచి రక్తస్రావం అవుతూ భరించలేని నొప్పి ప్రారంభమైంది. కుటుంబసభ్యులు హుటాహుటిన 108 అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిల్చోలేని స్థితిలో ఉన్న ఆమె కోసం వీల్‌ఛైర్‌ కావాలని సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. చివరకు నొప్పిని భరిస్తూనే ఆమె అంబులెన్సు దిగారు. ఉబికొచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ ఆసుపత్రిలోకి అడుగులు వేశారు. ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నించగా వీల్‌ఛైర్లు తీసుకెళ్లి ఎక్కడెక్కడో పెడుతుండటంతో కనిపించడం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

- న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు