
Published : 17 Jan 2022 04:16 IST
లక్ష్మీ బ్యారేజీలో మూడు గేట్ల ఎత్తివేత
మహదేవపూర్, న్యూస్టుడే: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి 12,490 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం మూడు గేట్లు ఎత్తి 12,490 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సరస్వతీ (అన్నారం) బ్యారేజీకి 1200 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా రెండు గేట్ల ద్వారా 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీలకుగాను 13.38 టీఎంసీలు, సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీలకు గాను 8.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పెరిగే అవకాశముండటంతో నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
Tags :