తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ఏటా కనుమ పండుగనాడు నిర్వహించే ఈ వేడుకలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణుడిని

Updated : 17 Jan 2022 06:00 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ఏటా కనుమ పండుగనాడు నిర్వహించే ఈ వేడుకలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణుడిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి కల్యాణ మండపంలో కొలువుదీర్చారు. తితిదే ఉద్యాన శాఖ క్రూర జంతువులు, అడవిని ప్రతిబింబించేలా అలంకరించిన సెట్టింగ్‌లో పార్వేట వేడుక నిర్వహించారు. అర్చకులు మూడుసార్లు స్వామివారి తరఫున ఈటెను విసిరి వేటను రక్తి కట్టించారు. సాయంత్రం స్వామివార్లు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దంపతులు ఆదివారం  వైకుంఠ ద్వారం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తితిదే క్యాలెండర్‌, డైరీలు అందజేశారు.

-న్యూస్‌టుడే, తిరుమల

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని