అశ్వంపై అఖండ!

సంక్రాంతి రోజున సినీనటుడు బాలకృష్ణ.. తన సోదరి, భాజపా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో సందడిగా గడిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులోని బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ఇంటి వద్దకు ప్రత్యేకంగా

Published : 17 Jan 2022 04:27 IST

సంక్రాంతి రోజున సినీనటుడు బాలకృష్ణ.. తన సోదరి, భాజపా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో సందడిగా గడిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులోని బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ఇంటి వద్దకు ప్రత్యేకంగా తీసుకొచ్చిన గుర్రం ఎక్కి కాసేపు తిరిగారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా బాలకృష్ణ దంపతులు, దగ్గుబాటి కుటుంబీకులు ఉత్సాహపరిచారు. అనంతరం అలంకరించిన బండి ఎక్కి ప్రాంగణంలో బాలకృష్ణ సరదాగా తిరిగారు. చీరాల మండలం వాడరేవు సముద్రతీరం వద్ద కూడా జీపులో తన సతీమణి వసుంధరతో కలిసి కిలోమీటరు మేర తిరిగారు.

- న్యూస్‌టుడే, పర్చూరు, చీరాల గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని