‘ఉమ్మడి నల్గొండ’లో నడిరేయి.. జడివాన

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భారీవర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువుల అలుగులు పారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published : 17 Jan 2022 04:27 IST

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భారీవర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువుల అలుగులు పారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లల్లోకి వాననీరు చేరటంతో రాత్రంతా జాగారం తప్పలేదు. సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో అత్యధికంగా 11.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షానికి సూర్యాపేట జిల్లాలో మిరప పంటకు నష్టం వాటిల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని