అకాల వర్షాలతో 34 వేల ఎకరాల్లో పంటనష్టం
గత పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 34 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరంగల్, హనుమకొండ, జయశంకర్ తదితర జిల్లాల్లో వడగండ్ల వానల కారణంగా మొక్కజొన్న, సెనగ, వేరుసెనగ, జొన్న, మిరప తదితర పంటలకు
ఈనాడు, హైదరాబాద్: గత పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 34 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరంగల్, హనుమకొండ, జయశంకర్ తదితర జిల్లాల్లో వడగండ్ల వానల కారణంగా మొక్కజొన్న, సెనగ, వేరుసెనగ, జొన్న, మిరప తదితర పంటలకు ఎక్కువ నష్టం జరిగినట్టు తేల్చింది. ఉద్యానశాఖ పరిధిలో ఉన్న మిరప, కూరగాయలు, పసుపు తదితర పంటల నష్టాలపై ఈ శాఖ విడిగా అంచనాలు సిద్ధం చేస్తోంది. మిరప తోట సాగుకు రైతులు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. వడగండ్లకు మిరపకాయలు రాలడంతోపాటు, చెట్లు నేలవాలడంతో అపారనష్టం వాటిల్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!