విశ్రాంత ఐఏఎస్‌ రమేష్‌ తల్లిదండ్రులు, సోదరికి నోటీసులు

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమేష్‌ తల్లిదండ్రులు, సోదరికి విజయవాడ పటమట పోలీసులు బుధవారం నోటీసులు అందజేశారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన తల్లిదండ్రులు

Published : 20 Jan 2022 05:29 IST

ఈనాడు, అమరావతి: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమేష్‌ తల్లిదండ్రులు, సోదరికి విజయవాడ పటమట పోలీసులు బుధవారం నోటీసులు అందజేశారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన తల్లిదండ్రులు పెనుమాక సుబ్బారావు, మణికి స్వయంగా ఇచ్చారు. ఆయన సోదరి అరుణకు వాట్సప్‌లో పంపించారు. వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి ఈనెల 22న తన ముందు హాజరు కావాలని పటమట సీఐ సురేష్‌రెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి రమేష్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషి... కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని