ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు లేనట్లే?
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పక్కనపెట్టింది. గత నెల 9వ తేదీన విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పక్కనపెట్టింది. గత నెల 9వ తేదీన విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్ ఉద్యోగులకు మాదిరిగానే ఆచార్యులకు పదవీ విరమణ వయసును పెంచేందుకు అంగీకరించారు. ఎంత పెంచాలన్న దానిపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని, ప్రతిపాదనలు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగులతో సమానంగా 61, మూడేళ్లు పెంచి 63, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మాదిరిగా 65...అనే మూడు రకాల ప్రతిపాదనలను విద్యాశాఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏమి నిర్ణయం వస్తుందో అని ఎదురుచూసిన సీనియర్ ఆచార్యులు నిరాశకు గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్