కవిత, దామోదర్రెడ్డిల ప్రమాణస్వీకారం
నిజామాబాద్, మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గాల తెరాస ఎమ్మీల్సీలుగా కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్రెడ్డిలతో మండలి ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి బుధవారం తన ఛాంబర్లో ప్రమాణస్వీకారం చేయించారు
మంత్రులు, నేతల అభినందనలు
ఈనాడు, హైదరాబాద్: నిజామాబాద్, మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గాల తెరాస ఎమ్మీల్సీలుగా కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్రెడ్డిలతో మండలి ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి బుధవారం తన ఛాంబర్లో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, సత్యవతి రాథోడ్లు ఈ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్ ఎమ్మెల్సీలు గంగాధర్గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, భానుప్రసాదరావు, ఎమ్.ఎస్.ప్రభాకర్రావు, ఎల్.రమణ, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తమకు మరోసారి అవకాశం కల్పించిన తెరాస పార్టీకి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దామోదర్రెడ్డి సైతం సీఎంకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు