ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణస్వీకారం

ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ అమీనుల్‌ జాఫ్రీ తన ఛాంబర్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు

Published : 21 Jan 2022 06:11 IST


ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్న తాతా మధుసూదన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ అమీనుల్‌ జాఫ్రీ తన ఛాంబర్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని