Weather Forecast: తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు
ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో
ఈనాడు, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గడం వల్ల చలి తీవ్రత పెరిగింది. శనివారం తెల్లవారుజామున అత్యల్పంగా రెడ్డిపల్లి(రంగారెడ్డి జిల్లా)లో 10.3 డిగ్రీలు నమోదయింది. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణంకన్నా 17 శాతం అధికంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం