పంచాయతీ కార్యదర్శుల ఐకాస ఏర్పాటు

రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై పోరాటానికి అన్ని సంఘాలు కలిసి రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఐకాసగా ఏర్పాటయ్యాయి. సోమవారమిక్కడ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు

Published : 25 Jan 2022 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై పోరాటానికి అన్ని సంఘాలు కలిసి రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఐకాసగా ఏర్పాటయ్యాయి. సోమవారమిక్కడ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, రమేష్‌, మహేష్‌, విజయ్‌కుమార్‌, ఖాసీం, కిరణ్‌కుమార్‌, రాజేశ్వర్‌రావు, శ్రీకాంత్‌గౌడ్‌ కలిసి పలు అంశాలపై చర్చించారు. రోజువారీ శానిటేషన్‌ రిపోర్టు పాత విధానంలో కొనసాగించాలని, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు.  ఐకాస శాశ్వత సభ్యులుగా వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని